5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత “మజ్జిగ చలివేంద్రం” ఈరోజు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో వీరంశెట్టి రాంబాబు, వీరంశెట్టి సతీష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
5 సంవత్సరాలుగా కోవిడ్ లాంటి విపత్తులలో కూడా కోనసీమ ఆహారనిధి & జేడి ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం నిర్వహించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు “వీరంశెట్టి సతీష్” తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ చీకట్ల,క్రాంతి, దర్నాల ధన, సిడ్డబతుల రమేష్, రంకిరెడ్డి శ్రీనివాస్,రమేష్, వీరంశెట్టి వెంకటేశ్వరరావు,చంటి పాల్గొన్నారు