06-07-2025 న విశాఖపట్నం చంద్రానగర్ ప్రాంతంలో జేడి ఫౌండేషన్ సభ్యులు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న మాత్రమే ఈ ప్రాంతంలోని చంద్రానగర్ మైన్ రోడ్డులో కొత్త మొక్కలు నాటడం జరిగిన విషయం విధితమే.
అదే ప్రదేశంలో ఐదు సంవత్సరాల క్రితం జేడి ఫౌండేషన్ సభ్యులు నాటిన ఒక మొక్క ఇప్పుడు పెద్ద చెట్టుగా పెరిగి, దాని నీడలో సభ్యులు ఫౌండేషన్ బ్యానర్తో కలిసి నిలబడి పర్యావరణ సేవ పట్ల తమ అంకితభావాన్ని ప్రతిబింబించారు.
ఈ ఘటన జేడీ ఫౌండేషన్ గతంలో చేసిన పర్యావరణ సేవా కార్యక్రమాల ఫలితాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మనుషుల ప్రేమ, సంరక్షణ, మరియు సమయపూర్వక శ్రద్ధతో ఒక చిన్న మొక్క ఎంత పెద్ద చెట్టుగా మారుతుందో ఈ ఉదాహరణ తెలియజేస్తోంది.
కార్యక్రమంలోని ముఖ్యాంశాలు :
- 5 ఏళ్ల క్రితం నాటిన చెట్టు ఇప్పుడు అందరికీ నీడనిచ్చే పెద్ద చెట్టుగా మారింది.
- పర్యావరణ పరిరక్షణలో కొనసాగుతున్న కృషి ఫలితం స్పష్టంగా కనిపించింది.
- గ్రూప్ సభ్యులు చెట్టు నీడలో ఫోటోలు తీసుకుంటూ పచ్చదన సేవకు మళ్లీ నిబద్ధత వహించారు.
- మొక్కల సంరక్షణ యొక్క ప్రాముఖ్యత మరోసారి ప్రజలకు తెలియజేయబడింది.
పాల్గొన్నవారు :
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు
- స్థానికులు
- పర్యావరణ సేవాభిలాషులు
