ప్రతిష్టాత్మక ఆరు సంవత్సరాల సేవా ప్రయాణం, 2019 జూన్ 10వ తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు “పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు” అనే మహోన్నత లక్ష్యంతో గోపాలపట్నం నుండి ప్రారంభమైన జేడీ ఫౌండేషన్, తన మొట్టమొదటి కార్యక్రమంగా 89వ వార్డు చంద్రానగర్ గ్రౌండ్లో “స్వచ్ఛ్ భారత్” నిర్వహించింది.
అక్కడి నుండి నిరంతరంగా సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ, ప్రతి నెలా—ప్రతి సంవత్సరం—కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతూ, ఇప్పుడు విశాఖపట్నం మొత్తం మీద “జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం” గా పరిణమించింది.
ఆరు సంవత్సరాల సఫలమైన ప్రయాణం – ప్రాముఖ్యత గల గుర్తింపులు :
ఈ 6 ఏళ్ల కాలంలో ఫౌండేషన్ కృషికి లభించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు:
🏆 జాతీయ స్థాయి గుర్తింపులు
- 2 PRSI National Awards
- Rotary Club Visakhapatnam & Meditech Zone – “Samajikeeyam – 2025” రెండు అవార్డులు
- GVMC నుండి Republic Day సందర్భంలో ప్రశంసాపత్రం
కీలక నాయకుల సహకారం :
ఈ ఆర్గనైజేషన్ అభివృద్ధికి దోహదం చేసిన ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు, ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారు, అలాగే ప్రతీ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయబడుతుంది.


10-06-2025 న నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమం
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని:
- మాధవధార, బాజీ జంక్షన్ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ
- అనంతరం ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీమతి కారుమూడి అను గారి నివాసంలో కేక్ కటింగ్
- భవిష్యత్తులో మరిన్ని సామాజిక, పర్యావరణ కార్యక్రమాలతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం 6వ వార్షికోత్సవం సందర్భంగా 10-06-2024 నుండి 10-06-2025 వరకూ చేపట్టిన కార్యక్రమాల వివరాలు :
- 23.06.24 – ఏరువాక పున్నమి రైతు దినోత్సవం, చింతగట్ల గ్రామం
- 29.06.24 – చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ
- 15.07.24 – మొక్కల నాటే కార్యక్రమం, చైతన్య టెక్నో స్కూల్
- 20.07.24 – సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తులకు మసాజ్ సేవ
- 02.08.24 – ZPH School యల్లపువానిపాలెం మొక్కల నాటడం
- 04.08.24 – సింహాచలం ఘాట్ రోడ్ వద్ద స్వచ్ఛ భారత్
- 19.08.24 – రక్షా బంధన్ వృక్షా బంధన్
- 21.08.24 – K.V. మల్కాపురం స్కూల్ విత్తనబంతులు
- 30.08.24 – ZPH School కొత్తపాలెం మొక్కలు
- 05.09.24 – మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
- 11.09.24 – యరాడ కొండపై విత్తనబంతులు
- 18.09.24 – గోపాలపట్నం గర్ల్స్ ZPH విత్తనబంతులు
- 21.09.24 – స్వచ్ భారత్ బీచ్ క్లీనింగ్
- 01.10.24 – కొత్తపాలెం విత్తన బంతులు
- 10.10.24 – శ్రీ కుమారి కేటరింగ్ సంచులు పంపిణీ
- 20.10.24 – స్టీల్ బాక్స్ ఛాలెంజ్
- 08.11.24 – బాలాజీ స్కూల్ విత్తనబంతులు
- 02.12.24 – అడవివరం స్కూల్ విత్తనబంతులు
- 12.12.24 – AU గ్రౌండ్లో ఆర్గానిక్ మేళా స్టాల్
- 29.12.24 – మర్రిపాలెం రైతు బజార్ సంచులు
- 03.01.25 – కొత్తపాలెం గుడ్డ సంచులు
- 04.01.25 – సావిత్రిబాయి పూలే జయంతి
- 07.01.25 – నరసింహ నగర్ రైతు బజార్
- 10.01.25 – K.V. మల్కాపురం స్కూల్ పొలంబడి
- 18.01.25 – జీవీఎంసీ శివాజీ పార్క్ స్వర్ణాంధ్ర కార్యక్రమం
- 19.01.25 – సింహాచలం గుడ్డ సంచులు పంపిణీ
- 03.02.25 – K.V. మల్కాపురం మొక్కలు
- 07.02.25 – మింది మసీద్ సంచులు
- 10.02.25 – K.V. నౌసేనాభాగ్ పొలంబడి
- 16.02.25 – కొత్తపాలెం గుడి మొక్కలు
- 28.02.25 – పాంచాలి గ్రంథాలయం ప్రారంభం
- యముడు వేషధారణతో ప్లాస్టిక్ నిషేధ అవగాహన
- గోవిందపురం గ్రంథాలయం ప్రారంభం
- 13.03.25 – గోపాలపట్నం గ్రంథాలయం ప్రారంభం
- 15.03.25 – వృక్ష నాటకం గోపాలపట్నం, నాయుడుతోట
- 16.03.25 – యల్లపువానిపాలెం స్మశానవాటిక
- 10.03.25 – ముత్యాలమ్మ పాలెం విలువల బడి ప్రారంభం
- అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం కార్యక్రమం
- 27.03.25 – గుర్రాలపాలెం విలువలబడి
- గోపాలపట్నం ఇంకుడు గుంత
- మాధవధార ఈస్ట్ పార్క్ ఇంకుడు గుంత
- గాజువాక ఇంకుడు గుంత
- నడుపూరు ఇంకుడు గుంత
- 17.05.25 – స్వచ్ఛ భారత్ BSNL ఆఫీస్
- 19.05.25 – 50kg సింగిల్-యూజ్ ప్లాస్టిక్ జోన్-8కు అప్పగింత
- 01.06.25 – గాజువాక 67వ వార్డు స్వచ్ భారత్ విత్ కార్పొరేటర్
ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
అంతిమ సందేశం :
“పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు” అనే మహావాక్యాన్ని నమ్ముకొని ఫౌండేషన్ సభ్యులు చూపిన అంకితభావమే ఈ ఆరు సంవత్సరాల గొప్ప యాత్రను సాధ్యము చేసింది. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో జేడీ సార్ ఆశయాలకు అనుగుణంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ…


