11-06-2025 న జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతగట్ట్ల పంచాయితీకి చెందిన నందవానిపాలెం గ్రామంలో “ఏరువాక పున్నమి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ సంప్రదాయాలను కాపాడుతూ, రైతుల కృషిని గౌరవించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో “రైతే రాజు – గ్రామస్వరాజ్యమే ధ్యేయం” అనే నినాదంతో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొలాన్ని ట్రాక్టర్తో దుక్కు దున్ని, తరువాత మహిళా రైతులతో పాటు పలువురు రైతులను అభినందించారు.
కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు :
- సర్పంచ్ కనకరాజు గారు
- ఎంపీటీసీ నూకరాజు గారు

ఎంపీటీసీ నూకరాజు గారు పేర్కొన్నారు :
- రైతులకు ప్రధాన సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం
- ఉపాదిహామీ పనుల దుర్వినియోగం
- ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి జేడి లక్ష్మినారాయణ గారు మరింత చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు

జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను గారు సందేశం :
- జేడి గారికి వ్యవసాయం అంటే మక్కువ
- ఆహారాన్ని పండించే రైతులను గుర్తించి సన్మానించడం మన బాధ్యత అని తెలిపారు

కార్యక్రమ నిర్వహణ :
ఈ కార్యక్రమాన్ని యువరైతు బొడ్డేటి అప్పారావు గారు సమర్థవంతంగా నిర్వహించారు.
పాల్గొన్న వారు :
- గణేష్ గారు
- జేడి గ్రూప్ సభ్యులు
- స్థానిక గ్రామస్తులు
- పెద్ద సంఖ్యలో రైతులు

నందవానిపాలెం గ్రామంలో నిర్వహించిన ఈ ఏరువాక పున్నమి వేడుక గ్రామ వ్యవసాయ సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు, రైతుల పట్ల గౌరవ భావనను మరింత బలపరిచింది.










