Activities,Service “ప్రాణదాత కు సెల్యూట్”

“ప్రాణదాత కు సెల్యూట్”

Categories:

ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సన్మానించిన జేడీ లక్ష్మీనారాయణ.
ఆపత్కాలం లో సాటి మనిషి ని ఆదుకోవడం కి మించిన మానవత్వం లేదని, అటువంటి వారు అందరూ మహానుభావులే అని తెలిపారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు ఇటీవల అత్తాపూర్ దగ్గర బాలాజీ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండె నొప్పి తో పడిపోతే ,అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తక్షణమే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే,ఇటువంటి గొప్ప మానవతా మూర్తి ని స్వయంగా కలుసుకోవాలని,కానిస్టేబుల్ రాజశేఖర్ ని స్వయంగా తన జేడీ ఫౌండేషన్ కార్యాలయానికి పిలిపించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జేడీ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వృత్తి లో నిబద్ధత కలిగి, సేవా భావం తో పని చేయడం గొప్ప విషయం అని, అటువంటి పని చేసిన రాజశేఖర్ గొప్ప మానవతా మూర్తి అని ప్రశంసించారు.. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రాజశేఖర్ మాట్లాడుతూ తన జీవితంలో ఈ రోజు మరిచిపోని రోజు అని, జేడీ లక్ష్మీనారాయణ గారిని స్వయంగా కలవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అని ఈ రోజు జేడీ సర్ స్వయంగా తనను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ తో పాటు, న్యాయ విద్యార్థి మనిదీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *