17-07-2025 న విశాఖపట్నం 89వ వార్డు చంద్రానగర్ సబ్వే ప్రాంతంలో జేడి ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరో ముఖ్యమైన చర్య చేపట్టారు.
గతంలో ఈ ప్రాంతంలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యల్లో భాగంగా ముళ్ళ కంచె (thorn fencing) ఏర్పాటు చేయడం జరిగింది.
జీవీఎంసీ ట్రీ గార్డులు అందుబాటులో లేని పరిస్థితిలో,
పశువుల దాడుల నుండి మొక్కలను కాపాడటానికి ముళ్ల కంచె అమరిక అత్యవసరమైంది.
జేడీ ఫౌండేషన్ సభ్యులు సమన్వయంతో ఈ పనిని వేగంగా పూర్తి చేశారు.
కార్యక్రమం ముగిసిన వెంటనే కురిసిన భారీ వర్షం మొక్కలకు చక్కని ఊరటను అందించింది.
ఈ వర్షం మొక్కలు మరింత ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

గతంలో నాటిన చెట్ల విజయవంతమైన పెరుగుదల
గోపాలపట్నం చంద్రానగర్ సబ్వే అవతలి రోడ్డులో
ఐదు సంవత్సరాల క్రితం జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు
ఇప్పుడు బారీగా పెరిగి చెట్లుగా మారిన దృశ్యం ఈ ప్రాంత ప్రజలకు స్ఫూర్తినిస్తోంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా,
మొక్కలను నాటడం మాత్రమే కాదు, వాటిని సమయపూర్వకంగా సంరక్షించడం ఎంత ముఖ్యమో ఈ సందర్భం మరోసారి నిరూపించింది.
పాల్గొన్నవారు :
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు
- స్థానికులు
- పర్యావరణాన్ని ప్రేమించే వాలంటీర్లు

