యువత సేవా కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయించాలి
– జెడి లక్ష్మీనారాయణ

రక్తదానం అనేది రోగుల ప్రాణాలను కాపాడే గొప్ప సేవ

శుక్రవారం విజయనగరం జిల్లా రాజాంలో రక్తదాతలకు లక్ష్మీనారాయణ గారు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు యువకులు సేవా కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించాలని లక్ష్మీనారాయణ గారు కోరారు. విజయనగరం జిల్లా రాజాంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ దానం చేసిన రక్తం రోగుల విలువైన ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానం గొప్ప సేవ అని అన్నారు. శిబిరానికి అధిక సంఖ్యలో వచ్చిన రక్తదాతలకు లక్ష్మీనారాయణ గారు సర్టిఫికెట్లు అందజేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader