విత్తన బంతులు తయారు చేసిన విశాఖపట్నంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర & బాలికల విద్యార్థులు

28-06-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, విశాఖపట్నంలోని గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా “విత్తన బంతుల తయారీ కార్యక్రమం” నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు వంటి శూన్య భూభాగాల్లో సామాజిక వనాలు పెంపుట కోసం ఈ కార్యక్రమం చేపట్టబడింది.

విద్యార్థులతో తయారు చేసిన విత్తన బంతుల్లో ఉపయోగించిన విత్తనాలు :

  • సీతాఫలం
  • సపోటా
  • బొప్పాయి
  • నేరేడు
  • గంగరావి
  • పనస
  • మారేడు
  • చింత
  • వేప
  • కుంకుడు
  • పెద్ద గురివింద
  • తురాయి
  • రేగు
  • తదితర విత్తనాలు

విద్యార్థులకు ముందుగా విత్తన బంతుల అవసరం, వాటి ప్రయోజనం, మరియు పర్యావరణంలో వాటి పాత్రను వివరించబడింది. అనంతరం విద్యార్థులతో స్వయంగా విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథి :

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు

  • విత్తనబంతులు మొలకెత్తి చెట్లు పెరగడం ద్వారా నగరంలో వాతావరణ కాలుష్యం తగ్గించడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు.
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులను అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు :

  • శ్రీమతి కారుమూడి అను గారు, ఉత్తరాంధ్ర కన్వీనర్, జేడీ ఫౌండేషన్
  • ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
    • వై. స్వర్ణలత గారు
    • వై. వేణుగోపాల్ గారు
  • పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు
    • మజ్జూరి శ్రీనివాసరావు గారు
    • వై.ఎన్. ప్రసాద్ బాబు గారు
  • జేడీ గ్రూప్ సభ్యులు
  • పాఠశాలల ఉపాద్యాయులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader