26-05-2025 తేదీన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు రకాల విత్తనాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఇప్పటివరకు సేకరించిన విత్తనాలు:
- సీతాఫలం
- సపోటా
- నేరేడు
- మొక్కజొన్న
- చింత
- కొంకుడు
- రేగు
- పెద్ద గురివింద
- బొప్పాయి
- పనస
- వేప
- దోశ
- బూడిద గుమ్మడి
- గంగారవి
- పారిజాతం
- మామిడి
మరియు అనేక విత్తనాలు సేకరించడం జరిగింది.
కార్యక్రమం ఉద్దేశ్యం :
- భవిష్యత్తులో చెట్ల నాటడానికి అవసరమైన విత్తనాలను భద్రపరచడం.
- జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ పచ్చదనం పెంపొందించడం.
- సమాజంలో పర్యావరణంపై అవగాహన పెంచడం.

కార్యక్రమం విశేషాలు :
- సభ్యులు సమిష్టిగా విత్తనాలు సేకరించి వర్గీకరించారు.
- గ్రామీణ ప్రాంతాలు, తోటలు మరియు స్థానిక వనరుల నుంచి విత్తనాలను సేకరించడం జరిగింది.
- ఈ విత్తనాలు భవిష్యత్తులో వృక్షారోపణ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి.
“విత్తనాల సేకరణ నేడు చేసిన చిన్న పని కాదు, భవిష్యత్తు తరాల కోసం ఒక గొప్ప పెట్టుబడి.”
