01-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖపట్నం స్థానిక 89వ వార్డు, సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డు సమీపంలోని కొత్తపాలెం చెరువు గట్టు వద్ద స్వచ్ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
సుందరమైన విశాఖ మహానగరంలో కొంతమంది మందుబాబులు మరియు ఆకతాయిల నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా చెరువులు, కాలువలు గాజు సీసాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, జలచరాలు, పరిసర జీవవ్యవస్థపై కూడా దుష్ప్రభావం పడుతోంది.
ఈ సమస్యను గమనించిన జేడీ ఫౌండేషన్ సభ్యులు బాధ్యతతో ముందుకు వచ్చి, చెరువు గట్టు ప్రాంతంలో ముళ్లపొదలలో, చెరువు లోపల మరియు పరిసర ప్రాంతాల్లో పడేసిన వందలాది గాజు మందు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను శ్రమతో ఏరివేసి శుభ్రపరిచారు.

ఈ కార్యక్రమంలో చేపట్టిన ముఖ్య చర్యలు:
- చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాల తొలగింపు
- ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ
- ముళ్లపొదలలో దాగి ఉన్న చెత్తను తొలగింపు
- పరిసర ప్రాంతాలను శుభ్రంగా మార్చడం
- స్థానికులకు పర్యావరణ అవగాహన కల్పించడం

ఈ కార్యక్రమంలో 89వ వార్డు జీవీఎంసీ శానిటరీ మరియు హెల్త్ సిబ్బంది కూడా పాల్గొని, సేకరించిన చెత్తను సరైన విధంగా తరలించడం జరిగింది. జేడీ ఫౌండేషన్ సభ్యులతో పాటు జీవీఎంసీ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా జరిగింది.
స్థానిక ప్రజలు మాట్లాడుతూ, చెరువు ప్రాంతాల్లో మద్యం సేవించి చెత్త పడేస్తున్న ఆకతాయిలపై పోలీసులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా మాత్రమే చెరువులు, కాలువలు శాశ్వతంగా రక్షించబడతాయని వారు అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగించనుంది.


