విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ

28-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ కుమారి క్యాటరింగ్ ఆర్థిక సాయంతో, గోపాలపట్నం రైతు బజార్ లోపల పర్యావరణ హితమైన చేతి సంచులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీ బెహరా భాస్కరరావు గారు విచ్చేసి, ప్రజలందరూ పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకుని, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లిస్తున్న ప్లాస్టిక్ సంచులను విడనాడాలని సూచించారు.

ప్రతి సంవత్సరం శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ దవళ మోహన్ గారు ఉచితంగా పర్యావరణ హిత సంచులను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ ప్రసాద్ గారు, శ్రీ దవళ మోహన్ గారు, మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.


సమాజంలో పర్యావరణ అవగాహన పెంపొందించడంలో జేడీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయం.

జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు ప్లాస్టిక్ రహిత జీవనశైలి ప్రచారంలో ముందంజలో ఉంది.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణానికి మేలు చేసే చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులు తీసుకురావచ్చని ఫౌండేషన్ సభ్యులు ప్రజలకు సందేశం ఇచ్చారు. “ప్లాస్టిక్ కి గుడ్‌బై – ప్రకృతికి హలో” అనే నినాదంతో, పర్యావరణ స్నేహపూర్వక చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader