06-07-2025 న పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జేడి ఫౌండేషన్ సభ్యులు విశాఖపట్నం 89వ వార్డు చంద్రానగర్ రైల్వే సబ్వే దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదల ముఖ్యమని భావించి ఈ సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
నాటిన మొక్కల జాతులు :
- రావి
- తెల్ల మద్ది
- తురాయి
- దేవకాంచన
- మరియు ఇతర స్థానిక వృక్ష జాతులు
ఈ వృక్ష జాతులు నగర వాతావరణానికి అనుకూలంగానే కాకుండా, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలకమైనవి.
స్థానికులకు చేసిన విజ్ఞప్తి :
జేడి ఫౌండేషన్ సభ్యులు స్థానిక ప్రజలను ఉద్దేశించి:
- నాటిన మొక్కలను నిత్య సంరక్షణ చేయాలని
- మొక్కలకు నీరు పోయడం, రక్షణ చర్యలు చేపట్టాలని
- పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

పాల్గొన్నవారు :
- స్థానికులు
- జేడి ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు
- పర్యావరణ సేవాభిలాషులు
ఈ కార్యక్రమం ద్వారా చంద్రానగర్ పరిసరాలలో పచ్చదనం పెంపొందించడానికి ఒక మెచ్చు కోవగల దిశగా అడుగు పడింది.

