విశాఖపట్నం BSNL కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం

17-05-2025 తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం నిర్వహిస్తున్న “స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర” కార్యక్రమం సందర్భంలో గోపాలపట్నం BSNL ఆఫీస్ ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది.

ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ళ తుప్పలను తొలగించి వాటిని జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BSNL డిప్యూటి జనరల్ మేనేజర్ శ్రీ కె. జగదేశ్వరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని, పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు.

అలాగే పాల్గొన్న వారు:

  • BSNL SDE శ్రీ భగవాన్ గారు
  • BSNL JTO శ్రీ కృష్ణ గారు
  • జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ గోపి గారు
  • ఇతర BSNL సిబ్బంది
  • జేడీ గ్రూప్ సభ్యులు

కార్యక్రమం విశేషాలు :

  • BSNL కార్యాలయ ప్రాంగణం శుభ్రపరిచే కార్యక్రమం సజావుగా జరిగింది.
  • ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఒక మంచి దశ వేసింది.
  • స్థానిక సిబ్బంది, జీవీఎంసీ మరియు జేడీ ఫౌండేషన్ సభ్యులు సమిష్టిగా పనిచేశారు.

“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర వంటి కార్యక్రమాలు సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచుతాయి.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader