10-06-2025 న విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తిరువళ్లూరు గవర్నమెంట్ స్కూల్ లో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించబడింది. 10వ తరగతి & 12వ తరగతి గవర్నమెంట్ స్కూల్ లో చదివి 90% పైగా మార్కులు సాధించిన 11 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ 11 మందిలో ఒక విద్యార్థిని తిరువళ్లూరు జిల్లా టాపర్ కావడం విశేషం.
విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని:
జేడి ఫౌండేషన్ అందించిన కానుకలు :
- ప్రతి విద్యార్థికి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్
(పర్యావరణ హితంగా ఉండే, వినియోగదారికి ఉపయోగకరమైన కానుక)
ఈ స్వల్ప కానుక విద్యార్థుల్లో మరింత ఉత్తేజం, విద్యపై మరింత దృష్టి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ధన్యవాదాలు :
ఈ కార్యక్రమం సాఫల్యవంతం కావడానికి సహకరించిన
జేడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

వారి ప్రోత్సాహమే ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి సత్కరించడానికి ఈ కార్యక్రమానికి మూలం.





