Other Major Initiatives

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న ZPH స్కూల్ (బాయ్స్ & గర్ల్స్) లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో నిర్వహించే NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.15,000 చొప్పున, ఇంటర్ పూర్తి చేసే వరకు మొత్తం రూ.60,000 …

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు Read More »

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మపాలెం “విలువల బడి” లో ఉపాధ్యాయుల సన్మానం

05-09-2025న, దేశవ్యాప్తంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న “విలువల బడి” లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ, వారిని ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న ముఖ్యమైన భూమికను గుర్తిస్తూ ఈ వేడుక ఏర్పాటు చేయబడింది. ముత్యాలమ్మపాలెం “విలువల బడి”లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, మరియు స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ గురువులకు పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచగా, …

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మపాలెం “విలువల బడి” లో ఉపాధ్యాయుల సన్మానం Read More »

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విలువల బడి విద్యార్థులతో చిత్రలేఖన పోటీలు

05-09-2025న, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల బడి విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడం, మరియు విలువల ఆధారిత విద్యా ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించబడ్డాయి. జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ విద్య, విలువలు, మరియు సృజనాత్మకత పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. “ఉపాధ్యాయుడు మార్గం చూపే దీపం – విద్యార్థి ఆ మార్గంలో వెలుగు.” ఉపాధ్యాయ …

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విలువల బడి విద్యార్థులతో చిత్రలేఖన పోటీలు Read More »

ప్రత్యేక ఆకర్షణగా వినాయకుని వేషధారణ

విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం విశేష స్పందనను పొందింది. పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తుల హాజరు ఊహించని స్థాయిలో ఉంది. ఈ సందర్భంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎం. సతీష్ కుమార్ గారు వినాయకుని వేషధారణలో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన వినాయక వేషధారణతో పిల్లలు, పెద్దలు అందరూ …

ప్రత్యేక ఆకర్షణగా వినాయకుని వేషధారణ Read More »

రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యావరణ హిత విత్తన రాఖీలు తయారు చేసిన “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు

8-8-2025 న రాఖీ పౌర్ణమి సందర్భంగా, “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు పర్యావరణ హితమైన విత్తన రాఖీలు తయారు చేసి ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ, సాంప్రదాయ విలువలతో పాటు పచ్చదనం పట్ల ప్రేమను ప్రదర్శించారు. ఈ విత్తన రాఖీలు పర్యావరణానికి హాని కలిగించకుండా, నేలలో నాటితే మొక్కలుగా పెరిగే విధంగా రూపొందించబడ్డాయి. విద్యార్థులు రాఖీని కేవలం చెల్లి-అన్న బంధానికి గుర్తుగా కాకుండా, …

రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యావరణ హిత విత్తన రాఖీలు తయారు చేసిన “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు Read More »

వినాయక చవితి సందర్భంగా ముత్యాలమ్మ పాలెం విలువలబడి విద్యార్థుల చేత పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ

13-8-2025 న వినాయక చవితి సందర్భంగా, అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి విద్యార్థులు మరియు విద్యార్థినీ తమ సృజనాత్మకతను జోడించి పర్యావరణ హితమైన మట్టి గణపతి ప్రతిమలు తయారు చేశారు. చిన్నచిన్న చేతులతో ఎంతో మనసు పెట్టి చేసిన ఈ బొజ్జ గణపయ్య విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వినాయక చవితి పండుగను పర్యావరణానికి హాని కలగకుండా ఎలా జరుపుకోవచ్చో చూపించారు. మట్టి గణపతిని ఉపయోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా …

వినాయక చవితి సందర్భంగా ముత్యాలమ్మ పాలెం విలువలబడి విద్యార్థుల చేత పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ Read More »

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం

ఏప్రిల్ 3 మరియు 4 తేదీలలో, జెడి ఫౌండేషన్ ఛైర్మన్ మరియు సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు విశాఖపట్నంలో సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు మామూలు పుట్టినరోజు వేడుకలు కాక, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలుగా మార్చడం విశేషం.   మెగా రక్తదాన శిబిరం – ఒక మానవతా పిలుపు జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని “జీవితాన్ని రక్షించు …

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం Read More »

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ

ఏప్రిల్ 6, 2025: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు సమూహంగా చేరిన పలు ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుడ్డ సంచుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం CBI మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి భాగంగా నిర్వహించబడింది. పంపిణీ జరిగిన ప్రదేశాలు: ఈ పుణ్యప్రాంగణాల్లో భక్తులకు పునర్వినియోగయోగ్య గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వాడకుండా పండుగల నిర్వహణలో పర్యావరణ …

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ Read More »

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

ఏప్రిల్ 6, 2025 న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AID INDIA FOUNDATION (USA) సహకారంతో భక్తుల అన్నదాన నిమిత్తంగా బియ్యం బస్తాలు (5 క్వింటాళ్లు) దానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జేడీ ఫౌండేషన్ నిరంతరం ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ …

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ Read More »

జీవీఎంసీ స్వచ్ఛ్ అవార్డు దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం

26-07-2025 న జీవీఎంసీ నిర్వహించిన స్వచ్ఛ్ అవార్డుల సన్మాన కార్యక్రమంలో, విశాఖపట్నం నగరం దేశంలోనే సఫాయిమిత్ర సురక్షిత్ షెహర్ ప్రత్యేక కేటగిరీలో ప్రధమ స్థానం సాధించిన సందర్భంగా పలు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశాఖ బీచ్‌లోని ఎ.యు. కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ప్రధాన అతిథులు పాల్గొన్న వారు : మేయర్ సందేశం : మేయర్ పీలా శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ: అలాగే నగర ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. …

జీవీఎంసీ స్వచ్ఛ్ అవార్డు దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం Read More »

loader