విశాఖపట్నంలో “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ తీసుకున్న మరో వినూత్న కార్యక్రమం — “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”. ఈ పిలుపుకు విశాఖపట్నంలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ రోజు, 89వ వార్డు యల్లపువానిపాలెం సంతోష్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఉన్నతాధికారి శ్రీ దాడి వెంకట అప్పారావు గారి ఇంటి ఆవరణలో జేడీ ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు గుడ్డ సంచులు అందించి అభినందించారు. …
