17-04-2026: వేసవి కాలంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ జేడీ ఫౌండేషన్ సభ్యులు స్థానిక చంద్రానగర్ సబ్-వే ప్రాంతంలో నాటిన మొక్కలకు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేసవి తీవ్రత కారణంగా మొక్కలు ఎండిపోకుండా, ఆరోగ్యంగా పెరిగేలా వాటికి క్రమం తప్పకుండా నీరు అందించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు మొక్కల సంరక్షణ చర్యల్లో భాగంగా వాటికి నీరు పోసి పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు.
మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, అవి సక్రమంగా పెరిగే వరకు వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి మొక్కను జీవించి ఎదిగేలా చూడడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
పచ్చదనం పెంపొందించడం, వాతావరణ సమతుల్యతను కాపాడడం మరియు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించడం లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ నిరంతరం మొక్కల సంరక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని మొక్కల పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు.
