Blogs

ఐఐటి-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు

28-02-2026: తణుకు పట్టణంలోని విహాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఐటి-జేఈఈ, నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ విద్యా అవకాశాలు, వివిధ కోర్సులు, మరియు వాటికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన విధానం గురించి ఆయన సమగ్రంగా వివరించారు. ఇంజనీరింగ్, …

ఐఐటి-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు Read More »

దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం

24-02-2026, భద్రాచలం: స్థానిక శాంతినగర్‌లోని దివ్యాంగుల పాఠశాలలో జేడీ ఫౌండేషన్ అధినేత శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు మరియు శ్రీమతి ఊర్మిళ గారి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు కంభంపాటి సురేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు అన్నదానం నిర్వహించడం విశేషం. విద్యార్థులతో …

దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం Read More »

ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ తో ట్రీ గార్డ్ తయారు

21-02-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న కార్యక్రమంగా వాడేసిన ప్లాస్టిక్ పెట్ బాటిల్స్‌తో ట్రీ గార్డును తయారు చేసి, గతంలో నాటిన మొక్కకు ఏర్పాటు చేయడం జరిగింది. జేడీ ఫౌండేషన్ గతంలో నాటిన వందలాది మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకుని, వాటి అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తూ, మొక్కలను రక్షించే విధంగా ట్రీ గార్డులను రూపొందించడం ప్రత్యేకతగా నిలిచింది. మొక్కల సంరక్షణ కోసం జీవీఎంసీ వారు …

ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ తో ట్రీ గార్డ్ తయారు Read More »

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు

17-02-2026: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక గోపాలపట్నం BRTS రోడ్డు మార్గం మధ్యలో నాటిన మొక్కలకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నీటి సంరక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొక్కలు వేసిన తర్వాత వాటి సంరక్షణ అత్యంత ముఖ్యమని భావించిన ఫౌండేషన్ సభ్యులు, నీటి వృథాను తగ్గిస్తూ మొక్కలకు అవసరమైనంత నీరు చేరేలా ఒక సులభమైన పద్ధతిని అమలు చేశారు. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను కట్ చేసి భూమిలో అమర్చి, వాటి ద్వారా నీరు నెమ్మదిగా …

మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాటు Read More »

పొలంబడి పంట

09-02-2026: గత ఏడాది నవంబర్ నెలలో కే. కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ఆ సమయంలో విద్యార్థులతో కలిసి నాటిన కూరగాయ మొక్కలు ఇప్పుడు పుష్కలంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తున్నాయి. ఈ పంటలు విద్యార్థుల కృషి, పట్టుదల మరియు సరైన సంరక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పొలంబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా, మొక్కలను ఎలా నాటాలి, …

పొలంబడి పంట Read More »

మిoది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాడేసిన పెన్నుల సేకరణ

07-02-2026: మిoది గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లు నిండడంతో ఈ రోజు వాటిని తెరిచి అందులో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ పెన్నులను సేకరించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లను చురుకుగా వినియోగించడం వల్ల తక్కువ సమయంలోనే అవి నిండడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది. వాడిన పెన్నులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒకేచోట సేకరించడం ద్వారా పాఠశాల పరిసరాలు మరింత …

మిoది గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాడేసిన పెన్నుల సేకరణ Read More »

పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు కార్యక్రమాలు

02-02-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Stop Landfill Drop Used Pens Here” కార్యక్రమాన్ని విశాఖ మహానగరంలోని పలు పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది. రోజువారీగా వాడుతున్న ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కరగక పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్న నేపథ్యంలో, వాటిని ఒకేచోట సేకరించేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణంపై బాధ్యతా భావం పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. 02-02-2026: కేంద్రీయ విద్యాలయం, …

పాఠశాలల్లో పెన్ డ్రాప్ బాక్స్‌ల ఏర్పాటు కార్యక్రమాలు Read More »

వెంకటాపురం పాఠశాలలో పొలంబడి కార్యక్రమం

01-02-2026: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆనందపురం మండలం, వెంకటాపురం గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పొలంబడి కార్యక్రమం నిర్వహించబడింది. 01-02-2026: నేల సిద్ధం ఈ కార్యక్రమానికి భాగంగా మొదటి రోజు విద్యార్థులు పొలంబడి కార్యక్రమానికి అవసరమైన నేలను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు భూమిని శుభ్రపరచి, మొక్కలు నాటేందుకు అనువుగా తయారు చేయడం జరిగింది. ఈ దశలో విద్యార్థులకు వ్యవసాయం ప్రాధాన్యత, …

వెంకటాపురం పాఠశాలలో పొలంబడి కార్యక్రమం Read More »

జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాలలో విద్యార్థినులతో “పొలంబడి” కార్యక్రమం

24-01-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)లో విద్యార్థినులతో కలిసి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులతో వంకాయ, టమాటో, కాలిఫ్లవర్, మిరప తదితర కూరగాయ మొక్కలు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు, అలాగే దొండ, చిక్కుడు, పాదులు, మునగ వంటి మొక్కలను నాటించడం జరిగింది. ముందుగా మొక్కల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర, …

జిల్లా పరిషత్ ఉన్నత (బాలికల) పాఠశాలలో విద్యార్థినులతో “పొలంబడి” కార్యక్రమం Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాలు

21-01-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ వివిధ పాఠశాలల్లో యూజ్డ్ పెన్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేసి వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. జనవరి నెలలో నిర్వహించిన రెండు ముఖ్య కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 21-01-2026: కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 25 రోజుల క్రితం ఏర్పాటు చేసిన పెన్ డ్రాప్ బాక్స్‌లలో విద్యార్థులు బాధ్యతగా వాడేసిన పెన్నులను …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాడేసిన పెన్నుల సేకరణ కార్యక్రమాలు Read More »

loader